Karimnagar: కరీంనగర్ రూరల్ పీఎస్లో ఘనంగా రాఖీ వేడుకలు!
Karimnagar: రూరల్ పోలీస్ స్టేషన్లో రాఖీ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళా పోలీస్ సిబ్బంది తోటి సిబ్బందికి, సీఐ నిరంజన్ రెడ్డికి రాఖీలు కట్టి స్వీట్లు పంచుకున్నారు.
Karimnagar: కరీంనగర్ రూరల్ పీఎస్లో ఘనంగా రాఖీ వేడుకలు!
Karimnagar: రేపు జరగనున్న రాఖీ పండుగను పురస్కరించుకుని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఈరోజు రాఖీ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళా పోలీస్ సిబ్బంది స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి రాఖీలు కట్టి, స్వీట్లు పంచుకుని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖలో సోదరభావం, ఆత్మీయత, పరస్పర గౌరవాన్ని చాటేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డి, ఎస్ఐ లక్ష్మణ్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మహిళా సిబ్బంది శైలజ, పద్మజ, రేనా, సుప్రియ, కీర్తన తదితరులు పోలీస్ సిబ్బందికి రాఖీలు కట్టి స్వీట్లు అందించారు.
ఈ సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, రాఖీ పండుగ సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యుల మాదిరిగా ఐకమత్యంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.




