Jagtial: జగిత్యాలలో కరెంటు కోతలపై రైతుల రాస్తారోకో!

Jagtial: వ్యవసాయ విద్యుత్ కోతలను నిరసిస్తూ జగిత్యాల జిల్లా చల్‌గల్ వద్ద జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించి, నిరంతరం కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ANAND, JAGITYAL
Published on: 11 Sept 2026 11:54 AM IST
Jagtial
X

Jagtial: జగిత్యాలలో కరెంటు కోతలపై రైతుల రాస్తారోకో!

Jagtial: వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో తీవ్ర కోతలు విధిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు కోతలను నిరసిస్తూ జగిత్యాల – నిజామాబాద్ జాతీయ రహదారిపై చల్‌గల్ వద్ద గురువారం భారీ రాస్తారోకో చేపట్టారు.

రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో దారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

రైతుల ఆవేదన:

* హామీలు నీటిమూటలే: 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ప్రస్తుతం కనీసం 7 గంటలు కూడా అరకొరగా ఇస్తోందని రైతులు మండిపడ్డారు.

* ఎండిపోతున్న పంటలు: వేళాపాళా లేని లో-వోల్టేజీ కరెంటు వల్ల పొలాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, మరోవైపు మోటార్లు కాలిపోయి తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

* డిమాండ్: వెంటనే ప్రభుత్వం స్పందించి సాగునీటికి నిరంతరాయంగా 24 గంటల ఉపాధి విద్యుత్‌ను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL

Next Story