Karimnagar: అర్హులైన పేదలకు ఇళ్లు ఇవ్వాల్సిందే.. ప్రజా పాలనలో అంజన్ కుమార్ డిమాండ్!
Karimnagar: కరీంనగర్లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ పాల్గొన్నారు.
Karimnagar: అర్హులైన పేదలకు ఇళ్లు ఇవ్వాల్సిందే.. ప్రజా పాలనలో అంజన్ కుమార్ డిమాండ్!
కరీంనగర్: నగరంలో నిర్వహించిన ప్రభుత్వం “నియోజకవర్గ స్థాయి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమానికి కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ హాజరై, నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల అర్హులైన వారి పక్షాన మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితిలో L1 L2 తో పాటు మరొకసారి L3 లో ఉన్నటువంటి లబ్ధిదారులకు న్యాయం చేయాలని L3 చాలామంది పేదలు అరులైన వారు ఉన్నారని వారిని మరొక్కసారి ఎంక్వయిరీ చేసి అర్హులైన పేదలకు కేటాయించాలని కోరారు. పేదలలై న వారిని L1,&L2 లొ తీసుకోవాలని కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ కోరడం జరిగింది అమలు అవుతున్న ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వివరించారు. సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు.




