Kakinada: పిఠాపురం మెగా పీటీఎమ్లో JC అపూర్వ భరత్
Kakinada: కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన "మెగా పిటీఎమ్ 4.0" కార్యక్రమంలో జేసీ అపూర్వ భరత్ పాల్గొన్నారు.
Kakinada: పిఠాపురం మెగా పీటీఎమ్లో JC అపూర్వ భరత్
కాకినాడ జిల్లా: పండుగవాతావరణం లో జిల్లా వ్యాప్తంగా 1269 పాఠశాలలు మరియు 16 కళాశాలలో "తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 4.0"(మెగా పి టి ఎం)
పిఠాపురం మండలం జగ్గయ్య చెరువు,ఎస్ బి ఎం ఆర్(శ్రీ బాదం మాధవ రావు ప్రభుత్వ బాలికా ఉన్నత పాఠశాల ప్లస్) పాఠశాలలో జరిగిన "తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల ఆత్మీయ సమా వేశం" నకు ముఖ్య అతిథి గా విచ్చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్...
వీరితోపాటు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామ స్వామి,డిఈఓ పి.రమేష్, పాఠశాల ప్రిన్సిపాల్ శ్యాంబాబు,ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు..
రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగం లో సమూల సంస్కరణలు అమలు చేస్తున్నది....తల్లి కి వందనం,ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య,డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా రుచి కరమైన భోజనం ను విద్యార్థులకు పంపిణీ, ఉచితంగా యూనిఫామ్, షూస్, పాఠ్యపుస్తకాలు పంపిణీ....చేస్తున్నది..*
తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల ఆత్మీయ సమా వేశం ద్వారా పిల్లల చదువుల తీరుపై తల్లిదండ్రులతో చర్చించడం.హాజరు మరియు ప్రవర్తన, పాఠశాలలో విద్యార్థుల పనితీరునుసమీక్షించడం. పిల్లల అభివృద్ధికి తల్లిదండ్రులు తీసు కోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా మెగా పిటియం నిర్వహణ.




