Kakinada: బీజేవైఎం కాకినాడ జిల్లా జీఎస్‌గా లచ్చబాబు నియామకం

Kakinada: కాకినాడ జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శిగా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామానికి చెందిన ఏనుగుల లచ్చబాబు నియామకం.

V. Ramakrishna, Pithapuram
Published on: 22 July 2026 9:05 AM IST
Kakinada
X

Kakinada: బీజేవైఎం కాకినాడ జిల్లా జీఎస్‌గా లచ్చబాబు నియామకం

Kakinada: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం చిత్రాడ గ్రామానికి చెందిన యువ నాయకుడు ఏనుగుల లచ్చబాబు భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి (జీఎస్)గా నియమితులయ్యారు.

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు లచ్చబాబుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. పార్టీ పట్ల ఆయన చూపుతున్న నిబద్ధత, సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్రను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.

యువతను పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షిస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు ప్రజాసేవలో మరింత చురుకుగా వ్యవహరించి, తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షించాయి.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story