Rayachoti: వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త రమేష్ మృతికి శ్రీకాంత్ రెడ్డి నివాళులు!

Rayachoti: సంబేపల్లె వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త తముకు రమేష్ భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 7 Sept 2026 5:56 PM IST
Rayachoti
X

Rayachoti: వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త రమేష్ మృతికి శ్రీకాంత్ రెడ్డి నివాళులు!

Rayachoti: సంబేపల్లె మండలం సంబేపల్లె కు చెందిన వైఎస్ఆర్ సిపి సోషియల్ మీడియా కార్యకర్త తముకు రమేష్ మృతికి వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి నివాళులర్పించారు. సోమవారం సంబేపల్లె లో రమేష్ భౌతిక కాయాన్ని సందర్శించి,అతని మృతిపట్ల సంతాపం తెలిపి, వారి కుటుంభ సభ్యులను పరామర్శించారు.

వైఎస్ఆర్ సీపీ సోషియల్ మీడియాలో తముకు రమేష్ చాలా చురుగ్గా ఉండేవారని, వారి సేవలు మరువలేనివని పేర్కొంటూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.వారి కుటుంబానికి తోడుగా ఉంటామన్నారు. నియోజక వర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి సోషియల్ మీడియా కార్యకర్తలు, నాయకులు నివాళులు అర్పించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story