Proddatur: ప్రొద్దుటూరులో రూ.55 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!
Proddatur: నియోజకవర్గంలో 29వ విడత సీఎం సహాయనిధి (CMRF) చెక్కులను స్థానిక టీడీపీ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పంపిణీ చేశారు
Proddatur: ప్రొద్దుటూరులో రూ.55 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!
ప్రొద్దటూరు: కూటమి ప్రభుత్వంలో పేద ప్రజలకు వైద్య అవసరాల కోసం సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి.
ప్రొద్దుటూరు నియోజకవర్గం సంబందించిన 29 విడత సిఎం రిరిఫ్ ఫండ్ చెక్కుల పంపిణి లో భాగంగా టిడిపి కార్యాలయం లో నేడు 61 మందికి 55 లక్షల రూపాయలు 36 వేల సిఎం రిరిఫ్ ఫండ్ చెక్కులు పంపిణి చేశాం అన్నారు.
ఇప్పటివరకు కూటమి ప్రభుత్వo ఏర్పడిన తర్వాత పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేయడంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రొద్దుటూరు రెండో, మూడు స్థానంలో ఉంది అన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రొద్దుటూరు నియోజకవర్గం సంబందించిన 1302 మందికి సిఎం రిరిఫ్ ఫండ్ చెక్కులు అందచేశాం.
పేదలకు సిఎం రిరిఫ్ ఫండ్ చెక్కులు ప్రొద్దుటూరు నియోజకవర్గం పరిధిలో మొత్తం 29 విడతలకు గాను సుమారుగా 11 కోట్ల 34 లక్షల 70 వేల రూపాయలు పంపిణి చేశాం.
రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలు అనారోగ్యానికి గురై ఆర్థిక సహాయం చేసే భాగంలో వెనుకబడిన పేద ప్రజల కోసం ఈ సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.




