Rajampet: రేపటి నుంచే ఇంటింటికి తెలుగుదేశం టీడీపీ శ్రేణులకు పిలుపు!
Rajampet: ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పిలుపునిచ్చారు.
Rajampet: రేపటి నుంచే ఇంటింటికి తెలుగుదేశం టీడీపీ శ్రేణులకు పిలుపు!
రాజంపేట: ఆదివారం నాడు స్థానిక నియోజకవర్గం పార్టీ ఒంటిమిట్ట మండల అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్య నాయకులతో నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా చమర్తి జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ రేపటి నుంచి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని మండల వ్యాప్తంగా పార్టీ శ్రేణులు విజయవంతంగా పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు ఒంటిమిట్ట పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story




