Mydukur: దువ్వూరులో ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ 21వ వార్షికోత్సవం

Mydukur: మైదుకూరు మండలం దువ్వూరు కేసీ కెనాల్ గట్టున కొలువుదీరిన శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన 21వ వార్షికోత్సవం సెప్టెంబర్ 7న అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 5 Sept 2026 3:04 PM IST
Mydukur
X

Mydukur: దువ్వూరులో ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ 21వ వార్షికోత్సవం

​మైదుకూరు: స్థానిక కేసీ కెనాల్ గట్టున కొలువుదీరిన శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన 21వ వార్షికోత్సవం సెప్టెంబర్ 7, సోమవారం నాడు అత్యంత వైభవంగా జరగనుంది. ఈ మేరకు ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామస్తులు ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. ​వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

​ఉదయం: మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారు. ఉదయం 8 గంటలకు ప్రత్యేక అర్చనలు చేపడతారు.

​హోమాలు: ఉదయం 9 గంటల నుంచి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆలూరు లక్ష్మీచైతన్య శర్మ ఆధ్వర్యంలో మహాగణపతి హవనం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి హవనం, నవగ్రహ హోమం మరియు షిర్డీ సాయిబాబా ప్రత్యేక హవనాలు శాస్త్రోక్తంగా జరగనున్నాయి.

​పూర్ణాహుతి - అన్నదానం: ఉదయం 11:30 గంటలకు మహా పూర్ణాహుతి, 12 గంటలకు తీర్థప్రసాద వితరణ ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి దాతల సహకారంతో భక్తులకు భారీ అన్నసంతర్పణ ఏర్పాటు చేశారు.

​గ్రామోత్సవం: సాయంత్రం 4 గంటల నుంచి శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి దివ్య గ్రామోత్సవం కన్నులపండువగా సాగనుంది.

​ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, ధన ధాన్య వస్తు రూపేణా సహకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story