Rayachoti: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళలు
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాఖీ పౌర్ణమి వేడుకల సందర్భంగా రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మహిళలు రాఖీలు కట్టి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.
Rayachoti: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళలు
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి లో రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి పలువురు మహిళలు ఆత్మీయంగా రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి గారు సోదరీమణుల ప్రేమాభిమానాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అన్నా-చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ బంధం ఎల్లప్పుడూ ప్రేమ, ఆప్యాయతలతో మరింత బలపడాలని ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమి వేడుకలు ప్రేమానురాగాలు, ఆత్మీయతల నడుమ ఘనంగా జరిగాయి.
Next Story




