Rayachoti: కోనంపేట శివాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
Rayachoti: అన్నమయ్య జిల్లా కోనంపేటలోని పురాతన శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాష్ట్ర ప్రజల సుఖశాంతుల కోసం ప్రార్థనలు.
Rayachoti: కోనంపేట శివాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి: రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లె మండలం కోనంపేట పురాతన శివాలయంలో ప్రత్యేక పూజలు... పరమేశ్వరుని ఆశీస్సులు కోరిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖల మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, కోనంపేట సర్పంచ్ లక్ష్మీనారాయణ ఆహ్వానం మేరకు కోనంపేటలోని పురాతన శ్రీ పరమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు మదన్మోహన్, దప్పేపల్లె సర్పంచ్ కేశవయ్య, కరెంట్ కాంట్రాక్టర్ యోగాంజనేయరెడ్డి, వెంకటనారాయణ, మచ్చా అంకన్న, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పాల్గొని మంత్రి గారికి ఘన స్వాగతం పలికారు.




