Veeraballi: విద్యుత్ స్తంభంపై ప్రైవేట్ వ్యక్తి ప్రమాదకర పనులు!
Veeraballi: కడప జిల్లా వీరబల్లిలో ఎల్సీ పర్మిషన్ లేకుండా లైవ్ విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తి. చర్యలు తీసుకోవాలని బీఎస్పీ రాజంపేట ఇన్చార్జ్ డిమాండ్.
Veeraballi: విద్యుత్ స్తంభంపై ప్రైవేట్ వ్యక్తి ప్రమాదకర పనులు!
Veeraballi: కడప జిల్లా వీరబల్లి మండలం వీరబల్లి గ్రామంలో బొంగవాండ్లపల్లి నివాసి అయిన బొంగ రామ సంజీవరెడ్డి సన్నాఫ్ భాస్కర్ రెడ్డి అతనికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగమ చేయనప్పటికి బొంగవండ్లపల్లి మామిడి తోట సమీపంలో ఎల్ సి పర్మిషన్ తీసుకోకుండా ఆన్ ఎలక్ట్రికల్ సప్లై ఉండగా కరెంట్ స్తంభం పైకి ఎక్కి కటింగ్ ప్లేయర్ తో వర్క్ చేస్తున్నాడు.
ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చెయ్యని ఈ వ్యక్తిపై ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్(ఏఈ) గారు మరియు ఎలక్ట్రికల్ జిల్లా అధికారులు దీని పరిశీలించి తక్షణమే బొంగ రామ సంజీవరెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఎల్సి తీసుకోకుండా స్తంభాలు ఎక్కిన ఎంల్పర్లు చాలామంది ప్రమాదవశాత్తు కాలిపోయి ఉన్నారు. స్తంభం పైన చనిపోయిన వారు ఉన్నారు దానిని మీరు గమనించి ప్రజారక్షణకై ఉన్నత అధికారులు ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాజేంపేట బహుజన సమాజ్ పార్టీ ఇంచార్జ్ పెద్దవీటి నరసింహులు కోరుతున్నారు.




