Madanapalle: మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసులు తండ్రి కన్నుమూత

Madanapalle: మదనపల్లె మాజీ మార్కెట్ చైర్మన్ తట్టి శ్రీనివాసులు తండ్రి ఉత్తమరెడ్డి మృతి చెందగా, టీడీపీ, జనసేన నేతలు రాందాస్ చౌదరి, శ్రీరామ్ చినబాబు పరామర్శించారు.

Srinivasulu, Madanapalle
Published on: 8 Aug 2026 6:02 PM IST
Madanapalle
X

Madanapalle: మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసులు తండ్రి కన్నుమూత

Madanapalle: మదనపల్లె, ఆగస్టు 8: మదనపల్లె మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తట్టి శ్రీనివాసులు తండ్రి తట్టి ఉత్తమ రెడ్డి మృతి చెందారు. ఉత్తమ రెడ్డి మృతి విషయం తెలుసుకున్న టీడీపీ, జనసేన నాయకులు రాందాస్ చౌదరి, శ్రీరామ్ చినబాబు తట్టి శ్రీనివాసులు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఉత్తమ రెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, తట్టి శ్రీనివాసులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.

అనంతరం యాలగిరి దొరస్వామి నాయుడు, మెహబూబ్ ఖాన్, జాఫర్, జేసీ రెడ్డప్ప తదితరులు తట్టి శ్రీనివాసులు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక నాయకులు ఉత్తమ రెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story