Chinnamandem: చిన్నమండెం పట్టణంలో నూతన బోరు ప్రారంభం
Chinnamandem: అన్నమయ్య జిల్లా చిన్నమండెం పట్టణంలో నూతన బోరును ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ. స్థానిక ప్రజలకు మెరుగైన తాగునీటి వసతి.
Chinnamandem: చిన్నమండెం పట్టణంలో నూతన బోరు ప్రారంభం
చిన్నమండెం: అన్నమయ్య జిల్లా చిన్నమండెం పట్టణంలో నూతన బోరు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ పాల్గొని బోరును ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరితమ్మ మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
నూతన బోరు అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలకు తాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మూవీ రెడ్డప్ప , టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Next Story




