Rajendranagar: హైదర్ గూడలో పోలీసుల మెరుపు దాడి.. 14 క్వింటాల బియ్యం సీజ్!
Rajendranagar: రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్ గూడలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. 14 క్వింటాల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న మజీద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Rajendranagar: హైదర్ గూడలో పోలీసుల మెరుపు దాడి.. 14 క్వింటాల బియ్యం సీజ్!
శంషాబాద్: రాజేంద్రనగర్ హైదర్ గూడలో రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటో సీజ్. హైదర్ గూడా ఈశ్వర్ థియేటర్ వద్ద 14 క్వింటాల రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోని పట్టుకున్న రాజేంద్రనగర్ పోలీసులు. మజీద్ అనే యువకుడు ఇళ్లలో నుంచి రేషన్ బియ్యం కొనుక్కొని సాజిద్ అని అనే వ్యక్తికి అమ్ముతుంటాడు. పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో ఆటో పై నిఘా పెట్టిన పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఆటోను సీజ్ చేశారు. మజీద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని సాజిద్ కోసం గాలిస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు.
Next Story




