ఇరాన్ టార్గెట్‌గా అమెరికా భారీ స్కెచ్.. సుప్రీం లీడర్ కోసం 10 మిలియన్ డాలర్ల ఆఫర్!

USA vs Iran War: ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా తీవ్రతరం చేసింది. ఇరాన్‌ దేశ అగ్ర నాయకత్వాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకుంది.

Arun Chilukuri
Published on: 14 March 2026 11:40 AM IST
ఇరాన్ టార్గెట్‌గా అమెరికా భారీ స్కెచ్.. సుప్రీం లీడర్ కోసం 10 మిలియన్ డాలర్ల ఆఫర్!
X

ఇరాన్ టార్గెట్‌గా అమెరికా భారీ స్కెచ్.. సుప్రీం లీడర్ కోసం 10 మిలియన్ డాలర్ల ఆఫర్!

USA vs Iran War: ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా తీవ్రతరం చేసింది. ఇరాన్‌ దేశ అగ్ర నాయకత్వాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీతో పాటు పలువురు ఉన్నతాధికారుల ఆచూకీ తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్ల రివార్డు అమెరికా ప్రకటించింది. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ‘రివార్డ్స్ ఫర్ జస్టిస్’ కార్యక్రమం కింద ఈ ప్రకటనను విడుదల చేసింది. మోజ్తబా ఖమేనీతో పాటు రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన కీలక సైనికాధికారులు అలీ అస్ఘర్ హెజాజీ, సెక్యూరిటీ చీఫ్ అలీ లారీజానీ పేర్లను కూడా ఈ జాబితాలో చేర్చింది.

ఫిబ్రవరి 28న ఇజ్రాయిల్‌, అమెరికా ఇరాన్‌పై సంయుక్తంగా దాడి చేసింది. ఈ దాడిలో మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించగా, ఆయన కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ మోజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ఈ దాడిలో ఆయన ముఖం గుర్తుపట్టలేనంతగా మారి ఉండొచ్చని, అందుకే ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బహిరంగంగా కనిపించడం లేదని అమెరికా అనుమానిస్తోంది.

గత మూడు వారాలు నుంచి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు చేస్తుంది. ఇప్పటివరకు 15 వేలకు పైగా లక్ష్యాలను ధ్వంసం చేశాయి. ఈ దాడుల వల్ల ఇరాన్ క్షిపణి సామర్థ్యం 90 శాతం, డ్రోన్ల శక్తి 95 శాతం క్షీణించినట్లు పెంటగాన్ తెలిపింది. రాబోవు రోజుల్లో దాడులు మరింత తీవ్రతరం చేస్తామని ట్రంప్ వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story