Boduppal: బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న బోడుప్పల్ మాజీ మేయర్ అజయ్ యాదవ్

Boduppal: బోడుప్పల్ కాంగ్రెస్ మైనారిటీ నేత మొహమ్మద్ యకూబ్ నివాసంలో ఘనంగా బక్రీద్ వేడుకలు.

KARUNAKAR, UPPAL
Published on: 28 May 2026 8:27 PM IST
Boduppal
X

Boduppal: బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న బోడుప్పల్ మాజీ మేయర్ అజయ్ యాదవ్

బోడుప్పల్: బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు, మస్జీద్-ఏ-కుతుబ్షాహీ అలంగిర్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ యకూబ్ నివాసంలో నిర్వహించిన ప్రత్యేక బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, బక్రీద్ పండుగ కేవలం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాదని, త్యాగం, విశ్వాసం, సేవాభావం, మానవత్వానికి ప్రతీకగా నిలిచే గొప్ప పండుగ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మత భేదాలు పక్కన పెట్టి పరస్పర గౌరవంతో, సోదరభావంతో కలిసి జీవించాలని సూచించారు. దేశంలో సామరస్య వాతావరణం నెలకొనాలంటే అన్ని మతాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

పండుగలు ప్రజల మధ్య ప్రేమాభిమానాలను పెంపొందిస్తూ సామాజిక ఐక్యతకు దోహదపడతాయని తెలిపారు. సమాజంలో శాంతి, అభివృద్ధి, పరస్పర అవగాహన పెరగడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అతిథులను ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో బీ బ్లాక్ అధ్యక్షులు కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి పద్మారెడ్డి, సీసా వెంకటేష్ గౌడ్, సుమన్ నాయక్, నాయకులు బీరప్ప, ఖాదర్, సమీ, బోలెష్, జావీద్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు, యువకులు, మైనారిటీ నాయకులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై బక్రీద్ శుభాకాంక్షలు పరస్పరం తెలియజేసుకున్నారు. వేడుకలు ఆత్మీయ, సోదరభావ వాతావరణంలో ఘనంగా ముగిశాయి.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story