Hyderabad: ఎల్బీనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్!
Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్ కుంట్లూరు రాజీవ్ గృహకల్ప వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ. 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలు.
Hyderabad: ఎల్బీనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్!
Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్లో కుంట్లూరు రాజీవ్ గృహకల్ప వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో 20మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




