Kukatpally: సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక పూజలు

Kukatpally: గురు పౌర్ణమి సందర్భంగా కేపీహెచ్‌బీ రోడ్ నెం. 2 సాయిబాబా ఆలయంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

MARUTI SAGAR, KUKATPALLY
Published on: 29 July 2026 4:27 PM IST
Kukatpally
X

Kukatpally: సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక పూజలు

గురు పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం ప్రత్యేక పూజలు

కూకట్‌పల్లి, మారుతి సాగర్ రిపోర్టర్: గురు పౌర్ణమి సందర్భంగా కూకట్‌పల్లి, కెపిహెచ్‌బీ కాలనీ రోడ్ నెం. 2లోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. సాయిబాబా ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు..

MARUTI SAGAR, KUKATPALLY

MARUTI SAGAR, KUKATPALLY

Next Story