Secunderabad: కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ!
Secunderabad: సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు నివాళులర్పించిన మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి.
Secunderabad: కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ!
Secunderabad: సికింద్రాబాద్ బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది అంటూ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ స్పష్టం చేశారు. కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు, మంత్రులు పోన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి లు,ఎంపీ ఈటల రాజేందర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ పాల్గొన్నారు.
జేబీఎస్ బస్టాండ్ వద్ద ఉన్న కొరివి విగ్రహానికి నాయకులు నివాళులర్పించారు. కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ విగ్రహానికి ఘనంగా పూలమాలలతో నివాళులర్పించారు.
తొలి మేయర్ గా కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ చేసిన సేవలు చిరస్మనీయమని వారన్నారు. బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.




