Kukatpally: జైపాల్ రెడ్డి వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన బండి రమేష్
Kukatpally: మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బాలానగర్లో ఘనంగా నివాళులు. పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి ఇన్చార్జి బండి రమేష్.
Kukatpally: జైపాల్ రెడ్డి వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన బండి రమేష్
కూకట్పల్లి: మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా బాలానగర్లోని వెంకటేశ్వర్ నగర్లో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, ఆయన ప్రజాసేవ, రాజకీయ విలువలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పుష్ప రెడ్డి, తూము సంతోష్, పులి శివగౌడ్, చంద్ర, నాగార్జున, క్రాంతి, నర్సింగ్, రాము, రమణ, జ్యోతి, శ్రీనివాస్, పార్వతి, ముస్తఫా తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జైపాల్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.
Next Story




