Hyderabad: టి-హబ్లో 'ట్రస్ట్ బిఫోర్ ఇంటెలిజెన్స్' పుస్తకావిష్కరణ
Hyderabad: గచ్చిబౌలి టి-హబ్లో రామ్ కాటుమరాజు రచించిన 'ట్రస్ట్ బిఫోర్ ఇంటెలిజెన్స్' పుస్తకాన్ని బిపిన్ పెండ్యాల ఆవిష్కరించారు. ఏఐ విశ్వసనీయతపై ప్రముఖుల చర్చ.
Hyderabad: టి-హబ్లో 'ట్రస్ట్ బిఫోర్ ఇంటెలిజెన్స్' పుస్తకావిష్కరణ
హైదరాబాద్: స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ కార్యాచరణలోకి దిగే విషయంలో కృత్రిమ మేధ (AI)ను ఎంతవరకు నమ్మవచ్చనే అంశంపై చర్చించే *'ట్రస్ట్ బిఫోర్ ఇంటెలిజెన్స్' (Trust Before Intelligence)* పుస్తకం శుక్రవారం హైదరాబాద్లోని గచ్చిబౌలి టి-హబ్ (T-Hub) వేదికగా ఆవిష్కరింపబడింది. కోలాబెర్రీ సీఈఓ రామ్ కాటుమరాజు రచించిన ఈ పుస్తకాన్ని హైసియా (HYSEA) అధ్యక్షుడు, ఫ్లైట్ లెఫ్టినెంట్ బిపిన్ పెండ్యాల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని కోలాబెర్రీ, కైరల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి.
ఏఐ విశ్వసనీయతే కీలకం: రామ్ కాటుమరాజు..
పుస్తకావిష్కరణ సందర్భంగా రచయిత రామ్ కాటుమరాజు మాట్లాడుతూ— "కృత్రిమ మేధ సాంకేతికతలో విశ్వసనీయత చాలా కీలకమైనది. ఏఐకి నిర్ణయాధికారం ఇచ్చి కార్యాచరణలోకి దింపేంతగా మనం దానిని విశ్వసించగలమా లేదా? అనేదే ప్రధాన ప్రశ్న. ప్రస్తుతం 95 శాతం ఏఐ ప్రయోగాత్మక ప్రాజెక్టులు ఎందుకు విఫలమవుతున్నాయి? కేవలం 5 శాతం మాత్రమే ఎందుకు విజయం సాధిస్తున్నాయి? అనే ప్రశ్నకు ఈ పుస్తకం సమాధానం ఇస్తుంది" అని తెలిపారు. నిర్ణయాలు తీసుకుని నేరుగా రంగంలోకి దిగే స్థాయికి ఏఐ విస్తరిస్తున్న తరుణంలో విశ్వసనీయత, గవర్నెన్స్, జవాబుదారీతనం అతిముఖ్యమైన అంశాలని స్పష్టం చేశారు. ముఖాముఖి, ప్యానెల్ చర్చలు..
ఈ కార్యక్రమంలో వాణిజ్య, సాంకేతిక రంగ ప్రముఖులు పాల్గొని వ్యాపార పరిణామాలపై లోతుగా చర్చించారు:
* బాల ప్రసాద్ పెద్దిగారి, డాక్టర్ రాజేష్ దుడ్డుల మధ్య ‘ఏఐ ఏజెంట్స్ ఇన్ ది రియల్ వరల్డ్: ఫ్రమ్ రీజనింగ్ టు యాక్షన్’ అనే అంశంపై జరిగిన ముఖాముఖి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో ఏఐ ఏజెంట్లు, మల్టీ-ఏజెంట్ వ్యవస్థలు, ఎన్సీపీ, ఏ2ఏ ఇంటర్ ఆపరేబిలిటీ, ఫిజికల్ ఏఐ మరియు మానవ పర్యవేక్షణ ప్రాముఖ్యతపై చర్చించారు.
* *ప్యానెల్ చర్చ:* డాక్టర్ రత్నాకర్ పాలకోడేటి, రాజేష్ గాలి ముంగార, సౌజన్య అనంతుని, ఫ్లైట్ లెఫ్టినెంట్ బిపిన్ పెండ్యాల, రామ్ కాటుమరాజులతో కూడిన ప్యానెల్ ‘ప్రిడిక్టివ్ టు అటానమస్ సప్లై చైన్స్: ది రైజ్ ఆఫ్ ఏజెంటిక్ లాజిస్టిక్స్’, ‘ట్రస్ట్ బిఫోర్ అటానమీ: హూ ఈజ్ అకౌంటబుల్ వెన్ ఏఐ యాక్ట్స్?’ అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది.
వ్యాపార సంస్థలు ఏఐకి ఎంతవరకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలి, ఏఐ నిర్ణయాల వల్ల ఆర్థిక పరిణామాలు ఎదురైనప్పుడు జవాబుదారీతనం ఎవరిది అనే అంశాలపై ఈ ప్యానెల్ లోతుగా విశ్లేషించింది. ఈ కార్యక్రమంలో కోలాబెర్రీ ఎండీ, కైరల్ సహ వ్యవస్థాపకులు రామమోహన్ తో పాటు పలువురు సాంకేతిక నిపుణులు, ప్రముఖులు పాల్గొన్నారు.




