Hyderabad: ఓల్డ్ మలక్‌పేట్‌లో జాతీయ డెంగ్యూ డే అవగాహన ర్యాలీ

Hyderabad: జాతీయ డెంగ్యూ డే సందర్భంగా ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో ఎంటమాలజీ, యశోద హాస్పిటల్ మరియు ఆరోగ్య కేంద్ర సిబ్బంది భారీ అవగాహన ర్యాలీ.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA
Published on: 17 May 2026 11:56 AM IST
Hyderabad
X

Hyderabad: ఓల్డ్ మలక్‌పేట్‌లో జాతీయ డెంగ్యూ డే అవగాహన ర్యాలీ

హైదరాబాద్: డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రజలు సహకరించాలని చార్మినార్ జోన్ ఎంటమాలజిస్ట్ నామాల శ్రీనివాస్ అన్నారు. ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో జాతీయ డెంగ్యూ డే సందర్భంగా ఎంటమాలజీ సిబ్బంది, యశోద హాస్పిటల్ నర్సింగ్ సిబ్బంది, జామ్‌బాగ్ ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. యశోద హాస్పిటల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ MCH కాలనీ, సరోజినగర్, అయోధ్య నగర్ కాలనీల మీదుగా కొనసాగింది. డెంగ్యూ నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులు ప్రజలకు సూచించారు.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

Next Story