Secunderabad: ఏకలవ్య స్ఫూర్తితో ఎదగండి.. విద్యార్థులకు ఎమ్మెల్యే శ్రీగణేశ్ పిలుపు!
Secunderabad: సికింద్రాబాద్లో ఎరుకల షెడ్యూల్డ్ ట్రైబల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏకలవ్య ప్రతిభా అవార్డుల కార్యక్రమం.
Secunderabad: ఏకలవ్య స్ఫూర్తితో ఎదగండి.. విద్యార్థులకు ఎమ్మెల్యే శ్రీగణేశ్ పిలుపు!
సికింద్రాబాద్: పేదరకాన్ని నిర్మూలించాలంటే చదువు ఒక్కటే మార్గమని కంటోన్మెంట్ ఏం ఎల్ ఏ శ్రీగణేశ్ అన్నారు..ఎరుకల సెడ్యూల్డ్ ట్రైబల్ ఎంప్లాయిస్ అసోషిన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకలవ్య ప్రతిభా అవార్డు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏం ఎల్ ఏ శ్రీగణేశ్ హాజరై విద్యార్థులకు స్కాలర్ షిప్స్ తోపాటు అవార్డ్స్ ఇచ్చి సన్మానించారు.
గత పురాణాలు తీసుకుంటే కూడా ఎరుకల జాతిలో పుట్టిన ఏకలవ్యుడు ఎంతటి ప్రతిభావంతుడో చరిత్ర చెబుతుందని, ద్రోణాచారుడు తన శిష్యులకు నేర్పిస్తున్న విలు విద్యను దూరంగా చూసి నేర్చుకున్నా అతన్ని ఎలా ఇబ్బందికి గురిచేశారో అప్పటి సమాజం చెబుతుందన్నారు. కానీ ఇప్పటి సమాజంలో అంబేద్కర్ అందరి అన్ని హక్కులు సమానంగా కల్పించారు కనుక అందరూ తమ జాతి పెద్దలు అందిస్తున్న సపోర్ట్ తీసుకొని సక్సెస్ కావాలని సూచించారు.




