Chevella: పట్నం నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్!
Chevella: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తల్లి రుక్కమ్మ దశదినకర్మకు కేటీఆర్ హాజరై, ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు.
Chevella: పట్నం నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్!
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల
కేటీఆర్ పరామర్శ: ఘన నివాళులు అర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ పట్నం నరేందర్ రెడ్డి తల్లిగారైన రుక్కమ్మ గారి చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఇటీవల రుక్కమ్మగారు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన దశదినకర్మ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీమతి రుక్కమ్మ గారి చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం, పట్నం నరేందర్ రెడ్డి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ,
ఇలాటి సమయంలో ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొని శ్రీమతి రుక్కమ్మ గారికి నివాళులు అర్పించారు.




