Secunderabad: సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులో బీఆర్ఎస్ నాయకుల నిరసన!
Secunderabad: రాంగోపాల్ పేట డివిజన్లో కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఎంజీ రోడ్డులో బీఆర్ఎస్ నిరసన అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్.
Secunderabad: సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులో బీఆర్ఎస్ నాయకుల నిరసన!
Secunderabad: కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసనకు దిగింది. సనత్ నగర్ నియోజకవర్గం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.రాంగోపాల్ పేట డివిజన్లో మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంజీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం సమీపంలో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శిశుపాలుడి మరణం 100 తప్పుల వరకు వేచి చూసినట్లుగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వెయ్యి రోజుల వరకు వేచి చూశామని, ఇకపై ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Next Story




