Hyderabad: విశ్వ విశ్వానిలో 21వ పీజీడీఎం బ్యాచ్ ప్రారంభం!

Hyderabad: విశ్వ విశ్వాని ఇన్‌స్టిట్యూట్‌లో 21వ పీజీడీఎం బ్యాచ్ ప్రారంభం. విద్యార్థులకు భావోద్వేగ మేధస్సు, వ్యక్తిత్వ వికాసం అవసరమని ప్రముఖుల మార్గదర్శనం.

RAJESH,	WEST ZONE
Published on: 19 Aug 2026 11:57 AM IST
Hyderabad
X

Hyderabad: విశ్వ విశ్వానిలో 21వ పీజీడీఎం బ్యాచ్ ప్రారంభం!

Hyderabad: హైదరాబాద్‌లోని విశ్వ విశ్వాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్‌మెంట్ 21వ పీజీడీఎం బ్యాచ్‌ను ప్రారంభించింది. క్యాంపస్‌లో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది.

విద్యార్థుల ఎదుగుదలలో భావోద్వేగ మేధస్సు, స్వీయ మూల్యాంకనం, వ్యవస్థాపక దృక్పథం కీలకమని సంస్థ అధ్యక్షుడు జీఎస్ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, పరివర్తనకు ప్రాధాన్యత ఇవ్వాలని డీన్, డైరెక్టర్ డాక్టర్ వీ జయశ్రీ సూచించారు.

పూర్వ విద్యార్థి, డయాకేర్ సొల్యూషన్స్ సహ వ్యవస్థాపకుడు అజిత్ మిశ్రా, మైండ్స్‌స్పార్క్ సహ వ్యవస్థాపకురాలు లక్ష్మీ నాయర్ విద్యార్థులకు వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో విజయానికి అవసరమైన అంశాలపై మార్గనిర్దేశం చేశారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story