Vinukonda: కలకలం.. డ్రైనేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం!

Vinukonda: వినుకొండ తిరుమల నర్సింగ్ హోమ్ ఎదురుగా ఉన్న డ్రైనేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 26 July 2026 3:19 PM IST
Vinukonda
X

Vinukonda: కలకలం.. డ్రైనేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం!

వినుకొండలో డ్రైనేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం

వినుకొండ: పట్టణంలో డ్రైనేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. పట్టణంలోని తిరుమల నర్సింగ్ హోమ్ ఎదురుగా ఉన్న డ్రైనేజీలో ఆదివారం ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఎవరు, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి, డ్రైనేజీలోకి ఎలా వచ్చాడు, ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story