Vinukonda: చాటగడ్డపాడులో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Vinukonda: వినుకొండ మండలం చాటగడ్డపాడులో భార్యాభర్తల గొడవ. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న భర్త కోటేశ్వరరావు. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలింపు.

KAREEMULLA, VINUKONDA
Published on: 28 July 2026 2:47 PM IST
Vinukonda
X

Vinukonda: చాటగడ్డపాడులో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

వినుకొండ: వినుకొండ మండలంలోని చాటగడ్డపాడు గ్రామంలో వ్యక్తిగత కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.​మార్కాపురం జిల్లా దొర్నాలకు చెందిన కోటేశ్వరరావుకు, చాటగడ్డ పాడు గ్రామానికి చెందిన కోటమ్మతో 2016లో వివాహం జరిగింది.

వీరికి ముగ్గురు పిల్లలు.​కోటేశ్వరరావు మద్యం బానిసగా మారి, తరచూ భార్య ప్రవర్తనపై అనుమానం పెట్టుకుని గొడవపడేవాడు. ఇదే విషయమై మంగళవారం ఉదయం భార్యాభర్తల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన కోటేశ్వరరావు తనపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.

ఈ ప్రమాదంలో అతని రెండు చేతులు మరియు వీపు భాగంలో దాదాపు 40% కాలిన గాయాలయ్యాయి.గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story