Vinukonda: శ్రీ రామలింగేశ్వర స్వామి తిరుణాల ఏర్పాట్ల పరిశీలన

Vinukonda: వినుకొండ శ్రీ రామలింగేశ్వర స్వామి తిరుణాల ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. భక్తులకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశం.

KAREEMULLA, VINUKONDA
Published on: 22 July 2026 5:11 PM IST
Vinukonda
X

Vinukonda: శ్రీ రామలింగేశ్వర స్వామి తిరుణాల ఏర్పాట్ల పరిశీలన

వినుకొండ: పట్టణంలో ఈ నెల 25న ఘనంగా జరగనున్న శ్రీ రామలింగేశ్వర స్వామి తిరుణాలను పురస్కరించుకుని అధికారులు చేపడుతున్న ఏర్పాట్లను ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రత్యక్షంగా పరిశీలించారు. కొండ దిగువ ప్రాంతం నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఆయన.. మార్గమధ్యంలో, అలాగే కొండపై జరుగుతున్న వివిధ అభివృద్ధి, నిర్వహణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

తిరుణాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొండపైకి భక్తులను తరలించేందుకు నాణ్యమైన, పూర్తి ఫిట్‌నెస్ కలిగిన ఆర్టీసీ బస్సులను మాత్రమే నడపాలని సూచించారు.

తిరుణాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జీవీ ఆంజనేయులు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని తిరుణాలను విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story