Vinukonda: విద్యుత్ ఘాతంతో జూనియర్ లైన్‌మెన్ మృతి.. బొగ్గరంలో తీవ్ర విషాదం!

Vinukonda: ఈపూరు మండలం బొగ్గరంలో ట్రాన్స్‌ఫార్మర్ పనులు చేస్తూ విద్యుత్ షాక్‌తో జూనియర్ లైన్‌మెన్ పి. వెంకటేష్ అక్కడికక్కడే మృతి. వినుకొండ పరిధిలో విషాదం.

KAREEMULLA, VINUKONDA
Published on: 17 Aug 2026 3:20 PM IST
Vinukonda
X

Vinukonda: విద్యుత్ ఘాతంతో జూనియర్ లైన్‌మెన్ మృతి.. బొగ్గరంలో తీవ్ర విషాదం!

Vinukonda: వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం బొగ్గరం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ శాఖలో జూనియర్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న పి. వెంకటేష్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. మృతుడు రొంపిచర్ల మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు.రోజువారీ విధుల్లో భాగంగా బొగ్గరం గ్రామ పరిధిలోని పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎడ్జ్ ఫ్యూజ్ సేకరణ పనులు నిర్వహిస్తున్న సమయంలో వెంకటేష్ ప్రమాదానికి గురైనట్లు సమాచారం.

విద్యుత్ సరఫరాకు సంబంధించిన పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. తీవ్ర విద్యుత్ షాక్ కారణంగా వెంకటేష్ ప్రాణాలు కోల్పోయాడు .సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

విద్యుత్ సరఫరా పరిస్థితులు, ట్రాన్స్‌ఫార్మర్ వద్ద చేపట్టిన పనులపై కూడా పరిశీలన చేస్తున్నారు.వెంకటేష్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, సహచర ఉద్యోగుల్లో విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story