Guntur: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై కొరడా: కమిషనర్ మయూర్ అశోక్!

Guntur: పట్నంబజార్‌లో నగర కమిషనర్ మయూర్ అశోక్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయిస్తున్న షాపులను సీజ్ చేసి, అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 3 Sept 2026 6:00 PM IST
Guntur
X

Guntur: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై కొరడా: కమిషనర్ మయూర్ అశోక్!

గుంటూరు: తనిఖీల్లో ప్రజారోగ్యానికి భంగం కల్గించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గుర్తింపు, షాప్ ల సీజ్, అపరాధ రుసుం విధింపు, గత 45 రోజుల నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మడం, వినియోగించడంపై నిషేధం పై తెలిపినా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం, ట్రేడ్ లైసెన్స్ లు లేకుండా షాప్ లు నిర్వహిస్తున్నా పట్టించుకోకపోవడంపై శానిటరీ ఇన్స్పెక్టర్, సెక్రెటరీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సిఎంఓహెచ్ ను ఆదేశించిన కమిషనర్.

హోల్ సేల్ షాప్ లకు క్యారీ బ్యాగ్ లు సరఫరా చేస్తున్న తయారీ సంస్థల వివరాలు తీసుకొని, నిర్దేశిత చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు, నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలే కాకుండా వినియోగించే వారిపై కూడా అపరాధ రుసుం విధించాలని, తాము ఆకస్మిక తనిఖీలు చేస్తామని స్పష్టం చేసిన కమిషనర్.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story