Vinukonda: సాగునీరు అందక చీకటీగలపాలెం రైతుల గోడు!

Vinukonda: చీకటీగలపాలెం మేజర్ కాల్వ చివరి భూములకు సాగునీరు అందక రైతుల ఆవేదన.

KAREEMULLA, VINUKONDA
Published on: 19 Jun 2026 4:43 PM IST
Vinukonda
X

Vinukonda: సాగునీరు అందక చీకటీగలపాలెం రైతుల గోడు!

Vinukonda: వినుకొండ మండలం చీకటీగలపాలెం మేజర్ కాల్వ చివరి ప్రాంతాలకు చెందిన రైతులు తీవ్రమైన సాగునీటి సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో NSP డీఈ ఆంజనేయులను కలిసి తమ సమస్యలను వివరించారు. కాల్వల చివరి భూములకు నీరు సరిగా చేరకపోవడంతో మెట్ట పంటలు కూడా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

సాగునీటి కోసం రాత్రింబవళ్లు కాల్వల వెంట తిరగాల్సి వస్తోందని, ఈ క్రమంలో పలువురు రైతులు పాముకాటుకు గురవుతున్నారని తెలిపారు. నాగార్జునసాగర్ నిర్మాణ సమయంలో రూపొందించిన కాల్వల రూపకల్పన ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదని, వాటిని ఆధునీకరించాలని కోరారు. అలాగే చివరి గ్రామాల వద్ద ఉన్న వాగులపై లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఏర్పాటు చేసి సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

రైతు సంఘం నాయకులు కాల్వ దుస్థితిని వివరించే ఫోటోలను డీఈకి అందజేశారు. దీనిపై స్పందించిన డీఈ ఆంజనేయులు, కాల్వలో కొంత భాగానికి త్వరలో మరమ్మతులు చేపడతామని, షట్టర్లు లేని ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేసి నీటి వృథాను అరికట్టి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story