Guntur: విద్యార్థినులకు వ్యక్తిత్వ వికాసం, మహిళా హక్కులపై అవగాహన సదస్సు!

Guntur: పుల్లడిగుంట మలినేని లక్ష్మయ్య ఇంజినీరింగ్ కాలేజీలో ఇండక్షన్ ప్రోగ్రామ్ 15వ రోజు ఘనంగా జరిగింది. వ్యక్తిత్వ వికాసం, మహిళా హక్కులపై నిపుణులు అవగాహన కల్పించారు.

ANANDBABU,	PRATTIPADU
Published on: 2 Sept 2026 9:54 PM IST
Guntur
X

Guntur: విద్యార్థినులకు వ్యక్తిత్వ వికాసం, మహిళా హక్కులపై అవగాహన సదస్సు!

గుంటూరు: మలినేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్న ఇండక్షన్ ప్రోగ్రామ్‌లో భాగంగా 15వ రోజు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు విద్య, వ్యక్తిత్వ వికాసం, సామాజిక అవగాహనకు సంబంధించిన పలు అంశాలపై ప్రముఖులు అవగాహన కల్పించారు.

ఉదయం సెషన్‌లో చుండి రంగనాయకులు కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ టి. వెంకట నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. విద్యార్థి దశలో జ్ఞానంతో పాటు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.

మధ్యాహ్నం సెషన్‌లో AIDWA, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి డి. రమాదేవి మరియు కిసాన్ సభ రాష్ట్ర అధ్యక్షురాలు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా సాధికారత, సామాజిక బాధ్యత, మహిళల హక్కులు, సమాజంలో మహిళల పాత్ర వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థినులు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకుని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆమె సూచించారు.

ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ, విద్యార్థుల్లో విద్యతో పాటు సామాజిక అవగాహన, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడమే ఇండక్షన్ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU

Next Story