Nuzvid: అధికారుల నిర్లక్ష్యంపై నూజివీడు పట్టణ ప్రజల ఆగ్రహం!

Nuzvid: నూజివీడు మున్సిపల్ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం.. 30వ కమిషనర్‌గా కే. వీరయ్య బాధ్యతలు చేపట్టినా అప్‌డేట్ కాని వివరాల బోర్డు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Sept 2026 3:26 PM IST
Nuzvid
X

Nuzvid: అధికారుల నిర్లక్ష్యంపై నూజివీడు పట్టణ ప్రజల ఆగ్రహం!

Nuzvid: నూజివీడు మున్సిపల్ కమిషనర్ ఎవరు? ఇంకా 27వ మున్సిపల్ కమిషనర్ ఎం వాసు బాబు కొనసాగుతున్నారా 2018 నుండి ఇప్పటివరకు ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ ఎవరు అని బోర్డుపై చూస్తే కమిషనర్ గా వాసు బాబు కొనసాగుతున్నట్లు ఉంది కానీ ప్రస్తుతం ఎన్నికల తర్వాత అబ్దుల్ రషీద్ 28వ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహించారు.

ఆయన ట్రాన్స్ఫర్ అనంతరం 29వ మున్సిపల్ కమిషనర్ గా వెంకటరామిరెడ్డి విధులు నిర్వహించారుఅనంతరం కె. పీరయ్య ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ అంటే 30వ మున్సిపల్ కమిషనర్ గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కె.వీరయ్య గారి పేరు బోర్డు మీద కనీసం పెట్టకపోవడం శోచనీయం.

అసలు ప్రభుత్వ మున్సిపల్ కార్యాలయానికి వచ్చే స్థానిక పట్టణ ప్రజలు బోర్డు చూడంగానే కమిషనర్ ఎవరు అన్నది ఏమీ అర్థం చేసుకోవచ్చు అన్న ప్రశ్న స్థానిక ప్రజల్లో ఉత్పన్నం అవుతుంది.ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపడతారా లేదా మా ఇష్టం అంటారా వేచి చూడాల్సి ఉంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story