Polavaram: ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత!

Polavaram: పోలవరం పరిధిలోని సోములగూడెం ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది.

RAJESH REDDY, CHINTOOR
Published on: 26 July 2026 2:39 PM IST
Polavaram
X

Polavaram: ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత!

పోలవరం: పోలవరంజిల్లా వరరామచంద్రాపురం మండలం సోములగూడెం ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి 31 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులు చింతూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.

ఆదివారం రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ పాయిజన్ ఏ విధంగా అయ్యిందో పాఠశాలకు వెళ్లి విచారణ చేస్తామని అన్నారు. విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థతకు గురవడం బాధాకరమని తెలిపారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR

Next Story