Madanapalle: నవ వధూవరులను ఆశీర్వదించిన నిస్సార్ అహ్మద్
Madanapalle: రామసముద్రం వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు రెడ్డి వీరయ్య గౌడ్ కుమార్తె మేఘన నిశ్చితార్థానికి మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ హాజరయ్యారు.
Madanapalle: నవ వధూవరులను ఆశీర్వదించిన నిస్సార్ అహ్మద్
Madanapalle: రామసముద్రం మండలం ఉలపాడు పంచాయతీ గంపనలపల్లికి చెందిన వైసీపీ మండల బీసీ సెల్ అధ్యక్షుడు రెడ్డి వీరయ్య గౌడ్ కుమార్తె మేఘన, కుశల్ మినీకి గోకుల్ కళ్యాణ మండపంలో నిశ్చితార్థ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మదనపల్లె వైసీపీ సమన్వయ కార్యకర్త నిస్సార్ అహ్మద్ హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవ దంపతులు ఆనందంగా, ఆయురారోగ్యాలతో జీవితం గడపాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి శుభకార్యాలు కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.
Next Story




