Madanapalle: మదనపల్లె హని కేసులో ట్విస్ట్.. బయటపడిన రాజీ ఒప్పంద పత్రాలు!

Madanapalle: మదనపల్లె హని (కృష్ణమోహన్ నాయుడు) కేసులో కొత్త కోణం. ఉమాదేవి ఆరోపణలను ఖండించిన కుటుంబ సభ్యులు.

Srinivasulu, Madanapalle
Published on: 16 Jun 2026 10:20 AM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె హని కేసులో ట్విస్ట్.. బయటపడిన రాజీ ఒప్పంద పత్రాలు!

Madanapalle: మదనపల్లె నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారిన పొత్తూరు కృష్ణమోహన్ నాయుడు (హని) వ్యవహారంలో తాజాగా మరో కోణం వెలుగులోకి వచ్చింది. తనకు ఆర్థికంగా అన్యాయం జరిగిందని ఆరోపించిన ఉమాదేవి వాదనలను కుటుంబ సభ్యులు, సంబంధిత వ్యక్తులు ఖండిస్తూ పలు పత్రాలు, వివరాలను బయటపెట్టారు.

ఉమాదేవి గతంలో ఇచ్చిన ఫిర్యాదులు, ప్రస్తుతం చేస్తున్న ఆర్థిక డిమాండ్ల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. అలాగే గతంలో పెద్దల సమక్షంలో రాజీ ఒప్పందం కుదిరిందని, ఆ సమయంలో పరస్పర అంగీకారంతో పత్రాలు కూడా రూపొందించుకున్నట్లు తెలిపారు.

మరోవైపు ఉమాదేవి కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత నిర్ణయాలు, కుటుంబ వివాదాలే ప్రస్తుత పరిస్థితికి కారణమని ఆమె తండ్రి నాగరాజు, సోదరుడు సుబ్రహ్మణ్యం ఆరోపించారు. హనిపై చేస్తున్న ఆరోపణలకు వ్యక్తిగత కక్షలే కారణమని వారు వాదిస్తున్నారు.

ఈ వ్యవహారంపై ఉమాదేవి వర్గం భిన్నంగా స్పందించే అవకాశం ఉండగా, ఇరు వర్గాల వాదనలు, సమర్పించిన పత్రాలపై అధికారులు జరిపే విచారణ అనంతరం పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం మదనపల్లె ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story