Madanapalle: మదనపల్లె గంటలోపే పోగొట్టుకున్న నెక్లెస్ దొరికింది

Madanapalle: మదనపల్లె బస్టాండ్‌లో 48 గ్రాముల బంగారు నెక్లెస్ పోగొట్టుకున్న బాధితురాలు. వెంటనే స్పందించి గంటలోపే నెక్లెస్‌ను గుర్తించి అప్పగించిన 2 టౌన్ పోలీసులు.

Srinivasulu, Madanapalle
Published on: 15 July 2026 7:08 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె గంటలోపే పోగొట్టుకున్న నెక్లెస్ దొరికింది

మదనపల్లె: మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్‌లో పోగొట్టుకున్న సుమారు 48 గ్రాముల బంగారు నెక్లెస్‌ను మదనపల్లె 2 టౌన్ పోలీసులు చాకచక్యంగా గుర్తించి బాధితురాలికి అప్పగించారు.

ఈ ఘటనలో పోలీసులు వేగంగా స్పందించి తమ సమయస్ఫూర్తిని చాటుకున్నారు. సత్యసాయి జిల్లా కదిరి మండలం చౌకుపాలెంకు చెందిన ఖాదరబీ తన భర్త ఫక్రుద్దీన్‌తో కలిసి కలికిరిలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు కదిరి నుంచి బస్సులో మదనపల్లెకు చేరుకున్నారు. అనంతరం కలికిరి బస్సు కోసం ఆర్టీసీ బస్టాండ్‌లో వేచి ఉండగా, ఆమె మెడలో ఉన్న బంగారు నెక్లెస్ అనుకోకుండా పోగొట్టుకుంది.

విషయం తెలుసుకున్న బాధితురాలు వెంటనే మదనపల్లె 2 టౌన్ పోలీసులను ఆశ్రయించగా, వారు వెంటనే చర్యలు చేపట్టి బస్టాండ్ పరిసరాల్లో గాలింపు నిర్వహించి, గంటలోపే 48 గ్రాముల బంగారు నెక్లెస్‌ను గుర్తించారు. అనంతరం బాధితురాలిని పిలిపించి ధృవీకరించి ఆమెకు నెక్లెస్‌ను అప్పగించారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story