Madanapalle: అన్నమయ్య జిల్లా బోర్డుల రచ్చ.. మదనపల్లె పేరుపై వివాదం!

Madanapalle: అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో ప్రభుత్వ కార్యాలయాల బోర్డుల వ్యవహారంపై వివాదం రేగింది.

Srinivasulu, Madanapalle
Published on: 1 July 2026 8:20 AM IST
Madanapalle
X

Madanapalle: అన్నమయ్య జిల్లా బోర్డుల రచ్చ.. మదనపల్లె పేరుపై వివాదం!

Madanapalle: అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌తో పాటు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులపై జిల్లా కేంద్రమైన మదనపల్లె పేరు కనిపించకపోవడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంగా మదనపల్లె ప్రకటించిన నేపథ్యంలో అధికారిక బోర్డులపై "అన్నమయ్య జిల్లా, మదనపల్లె" లేదా "మదనపల్లె జిల్లా (అన్నమయ్య)" అని స్పష్టంగా పేర్కొనాలని కోరుతున్నారు.

జిల్లా కేంద్రంగా మారిన తర్వాత కూడా పలు కార్యాలయాల బోర్డులపై కేవలం "అన్నమయ్య జిల్లా" అని మాత్రమే ఉండడంతో మదనపల్లెకు తగిన గుర్తింపు లభించడం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చారిత్రక, విద్యా, వాణిజ్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన మదనపల్లె పేరును అన్ని ప్రభుత్వ బోర్డుల్లో పొందుపరిస్తే ప్రజలకు మరింత స్పష్టత ఉంటుందని వారు సూచిస్తున్నారు.

ఈ విషయాన్ని సంబంధిత అధికారులు పరిశీలించి, అవసరమైన మార్పులు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story