Madanapalle: కుటుంబ కలహాల నేపథ్యంలో కుమారుడితో కలిసి మహిళ విషం తాగి ఆత్మహత్యాయత్నం

Madanapalle: మదనపల్లెలో భర్త వేధింపులు, విడాకుల నోటీసుల నేపథ్యంలో మహిళ కుమారుడితో కలిసి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Srinivasulu, Madanapalle
Published on: 1 Sept 2026 10:16 PM IST
Madanapalle
X

Madanapalle: కుటుంబ కలహాల నేపథ్యంలో కుమారుడితో కలిసి మహిళ విషం తాగి ఆత్మహత్యాయత్నం

మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె కుటుంబ కలహాలు, విడాకుల నోటీసు నేపథ్యంలో ఓ మహిళ తన మూడేళ్ల కుమారుడితో కలిసి విషం తాగిన ఘటన మదనపల్లెలో చోటుచేసుకుంది. తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోట మండలం మల్లెల గ్రామానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ భార్య సోనియా, ఆమె మూడేళ్ల కుమారుడు మహమ్మద్ కియాన్ ఈ ఘటనలో అస్వస్థతకు గురయ్యారు.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సోనియా భర్త బాబా ఫక్రుద్దీన్, అత్త రాబియాబి, మామ హజ్మత్ వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. మసీదు ద్వారా తలాక్‌కు సంబంధించిన విడాకుల నోటీసు పంపించడంతో సోనియా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిపారు.

ఈ క్రమంలో మదనపల్లె గరుడనగర్‌లోని తన చిన్నాన్న ఇంటికి వచ్చిన సోనియా, విడాకుల నోటీసు విషయం తెలుసుకున్న అనంతరం విషం తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెతో పాటు మూడేళ్ల కుమారుడు మహమ్మద్ కియాన్ కూడా విషం తాగినట్లు పేర్కొన్నారు.

ఘటనకు ముందు ఆమె సూసైడ్ నోట్ రాసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ అంశంపై పోలీసులు విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించాల్సి ఉంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన తల్లీకుమారుడిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అక్కడ వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మదనపల్లె ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ భాష ప్రభుత్వాసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

భర్త, అత్తమామల వేధింపుల కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడితే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story