Madanapalle: ఎమ్మెల్యేను కలిసిన నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు!
Madanapalle: మదనపల్లె ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషాను నాయీ బ్రాహ్మణ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.
Madanapalle: ఎమ్మెల్యేను కలిసిన నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు!
Madanapalle: మదనపల్లె శాసనసభ్యులు శ్రీ మహమ్మద్ షాజహాన్ బాషాను నాయీ బ్రాహ్మణ నాయకులు శుక్రవారం కలిసి తమ వృత్తికి సంబంధించిన పలు సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు.
ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్పొరేట్ సెలూన్ల కారణంగా స్థానిక నాయీ బ్రాహ్మణుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని తెలిపారు. మదనపల్లె నియోజకవర్గంలో తరతరాలుగా క్షవర వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక విధానం రూపొందించాలని, యువతకు ఆధునిక సెలూన్ల ఏర్పాటు కోసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సబ్సిడీ రుణాలు అందించాలని, ఆధునిక పరికరాలు, సెలూన్ ఇంటీరియర్, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం ప్రత్యేక ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని వినతిపత్రంలో కోరారు.
ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ నాయకులు మంగళ ప్రభాకర్, బుర్ర రంగస్వామి, యనమల రామకృష్ణ, ముస్తూరి మంజునాథ్, వేంపల్లి శంకర్, కన్నెమడుగు సూర్యనారాయణ, తనకంటి మంజునాథ్, యోగేంద్ర, భజంత్రి ఈశ్వర్, భజంత్రి నాగరాజ్, పుట్టపర్తి పాండు, భజంత్రి శివకుమార్, నారప్పగారి పాండు, పుట్టపర్తి రాజు, విష్ణు, కన్నెమడుగు మనోహర్, గుండ్లూరి నవీన్, రామాంజులు, ప్రసాద్, హరీష్, లుక్స్ గంగాధర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.




