Tumati Madhava Rao: ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా తూమాటి మాధవరావు
Tumati Madhava Rao: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Tumati Madhava Rao: ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా తూమాటి మాధవరావు
Tumati Madhava Rao: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ చైర్మన్ పదవికి మాధవరావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు సభలో అధికారికంగా ప్రకటించారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన డిప్యూటీ చైర్మన్ను గౌరవపూర్వకంగా అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టేందుకు సభలోని అన్ని రాజకీయ పక్షాల సభ్యులు కలిసి రావాలని చైర్మన్ మోషేన్ రాజు కోరారు. చైర్మన్తో పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మాధవరావును తోడ్కొని వెళ్లి అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి అభినందనలు తెలియజేశారు.
నూతన డిప్యూటీ చైర్మన్ను సీటు వద్దకు తోడ్కొని వెళ్లే క్రమంలో కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు రాకపోవడంపై మండలిలో వివాదం నెలకొంది. చైర్మన్ పిలిచినప్పటికీ కూటమి సభ్యులు రాకపోవడంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. శాసన మండలి సంప్రదాయాలను పక్కనబెట్టి కూటమి సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు.




