YS Jagan: ఉక్కు కార్మికులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు.. జగన్ సంచలన వ్యాఖ్యలు!
YS Jagan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.
YS Jagan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదఘటనలో తొమ్మిది మంది కార్మికులు చనిపోవడం బాధాకరమన్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. ప్రమాదంలో గాయపడి సెవన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను, మరణించిన వారి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించి.. ఓదార్చారు. కార్మిక సంఘాల నేతలతో జగన్ మాట్లాడారు. స్యీల్ ప్లాంట్ పరిస్థితులపై ఆరా తీశారు.
ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఉక్కు కార్మికుల పరిస్తితిపై అందరూ ఆలోచన చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాననవత్వంతో ప్రవర్తించాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులను తొలగిస్తున్నారని.. క్వార్టర్స్ వదిలి ఉద్యోగులు వెళ్ళిపోయే విధంగా చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు బోనస్, మెడికల్ ఫెసిలిటీ ఏమీ లేకుండా పోయాయన్నారు.
Next Story




