Seediri Appalaraju: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజూరు!

Seediri Appalaraju: వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రోడ్డు ప్రమాద కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారనే ఆరోపణలతో 24 రోజులుగా సబ్ జైలులో ఉన్నారు.

Arun Chilukuri
Published on: 14 Aug 2026 4:46 PM IST
Seediri Appalaraju
X

Seediri Appalaraju: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజూరు!

Seediri Appalaraju: వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు న్యాయస్థానంలో ఊరట లభించింది. రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన కేసులో ఆయనకు సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జూలై 10న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సాక్షాధారాలను తారుమారు చేశారనే అభియోగాలపై పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

రోడ్డు ప్రమాద కేసు దర్యాప్తులో భాగంగా జూలై 22న పోలీసులు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో గత 24 రోజులుగా ఆయన శ్రీకాకుళం జిల్లా సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన సోంపేట కోర్టు, శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ రావడంతో ఆయన త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story