Bhanu Prakash Reddy: కొండా సురేఖ ‘శూర్పణఖ’లా మాట్లాడుతున్నారు

Bhanu Prakash Reddy: శ్రీరాముడిపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆమెను శూర్పణఖతో పోల్చిన ఆయన, వెంటనే దేవాదాయ శాఖ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Arun Chilukuri
Published on: 6 May 2026 11:34 AM IST
Bhanu Prakash Reddy
X

Bhanu Prakash Reddy: కొండా సురేఖ ‘శూర్పణఖ’లా మాట్లాడుతున్నారు

Bhanu Prakash Reddy: మంత్రి కొండా సురేఖపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొండా సురేఖ రాముడి గురాంచి శూర్పణఖలా మాట్లాడారని అన్నారు. దేవాదాయశాఖకు సురేఖ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హిందువుల దేవుళ్లపై కించపరుస్తూ మాట్లాడిన మమతా బెనర్జీ ,స్టాలిన్, కమ్యూనిస్టు పార్టీలు తాజా ఎన్నికల్లో ఓడిపోయారన్నారు.

దేశంలో ఇక మిగిలింది ఆరు రాష్ట్రాలే అని...త్వరలో తెలంగాణలోనూ కాషాయజెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. మున్ముందు దేశమంతా కాషాయమయం కాబోతోందన్నారు. వెంటనే హిందువులకు కొండ సురేఖ క్షమాపణ చెప్పాలన్నారు భానుప్రకాష్.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story