Amaravati Capital Update: అమరావతిపై బిగ్ అప్డేట్.. కీలక అడుగు వేసిన కూటమి సర్కార్!
Amaravati Capital Update: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, నూతన రైల్వే లైన్ నిర్మాణాల కోసం తాడికొండ మండలం మోతడక గ్రామంలో 2,344.12 ఎకరాల భూసమీకరణకు సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Amaravati Capital Update: అమరావతిపై బిగ్ అప్డేట్.. కీలక అడుగు వేసిన కూటమి సర్కార్!
Amaravati Capital Update: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను పరుగులు పెట్టించేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ మరొక అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాజధాని విస్తరణ, రవాణా వ్యవస్థల ఆధునీకరణే లక్ష్యంగా గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని మోతడక గ్రామంలో బృహత్తర భూసమీకరణకు శ్రీకారం చుట్టింది.
దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ను సీఆర్డీఏ తాజాగా విడుదల చేయడంతో రాజధాని ప్రాంతంలో ఒక్కసారిగా హడావుడి పెరిగింది. రాజధానికి మకుటాయమానంగా నిలవబోయే రెండు ప్రధాన ప్రాజెక్టుల కోసం ఈ భూములను సమీకరిస్తున్నారు.
అమరావతి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, వేగవంతమైన ప్రయాణానికి దోహదపడే ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం. రాజధానిని దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో అనుసంధానించే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు. మొత్తం 2,344.12 ఎకరాల భూసమీకరణ లక్ష్యంగా సీఆర్డీఏ ప్రణాళికలు రూపొందించింది.
పట్టా భూములు 1,654.259 ఎకరాలు, ప్రభుత్వ భూములు 689.861 ఎకరాలు సేకరించనున్నారు. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడంలోనూ, రాజధాని కనెక్టివిటీని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లడంలోనూ మోతడకలో చేపడుతున్న ఈ భూసమీకరణ ప్రక్రియ అత్యంత కీలకమైన మైలురాయిగా నిలవబోతోంది.




