Nellore: సీఎం సహాయ నిధి అంటే పేదల సంజీవని.. గిరిధర్ రెడ్డి

Nellore: నెల్లూరు రూరల్ లో 28 మందికి 8 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

V. Narasimhulu, Nellore
Published on: 7 April 2026 8:38 PM IST
Nellore
X

Nellore: సీఎం సహాయ నిధి అంటే పేదల సంజీవని.. గిరిధర్ రెడ్డి

Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 28 మందికి 8 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ..

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలపాలిట సంజీవని అని, పేదల ప్రాణరక్షణకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని చెప్పారు..అనారోగ్యంతో బాధపడుతున్న పేదల ప్రాణాలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తోందని చెప్పారు. దరఖాస్తు చేసుకొన్న అర్హులందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరు చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 503 మందికి 4 కోట్ల 53లక్షల రూపాయల చెక్కులు అందజేశామని చెప్పారు.

పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. మాటమీద నిలబడే ప్రభుత్వం తమదని.. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని తెలియజేశారు నెల్లూరు రూరల్ టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ లు, కో క్లస్టర్ ఇంచార్జ్ లు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘల అధ్యక్షులు, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story