Allagadda: స్టేషన్ బెయిల్ కోసం డిమాండ్.. ఏసీబీ వలలో పోలీస్ అధికారి

Allagadda: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. స్టేషన్ బెయిల్ మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన హెడ్ కానిస్టేబుల్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 31 March 2026 9:50 PM IST
Allagadda
X

Allagadda: స్టేషన్ బెయిల్ కోసం డిమాండ్.. ఏసీబీ వలలో పోలీస్ అధికారి

Allagadda: ఆళ్లగడ్డ పట్టణంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన కేసులో స్టేషన్ బెయిల్ మంజూరు చేయడానికి కోటేశ్వరరావు బాధితుడిని రూ.35 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న వెల్లడించారు.

ఇప్పటికే బాధితుడు రూ.20 వేల రూపాయలు చెల్లించగా, మిగిలిన రూ.15 వేల కోసం హెడ్ కానిస్టేబుల్ ఒత్తిడి తెచ్చాడు. దీంతో బాధితుడు రఘునాథ ఆచారి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు పన్నిన వలలో కోటేశ్వరరావు రూ.15 వేల లంచం స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అయితే కానిస్టేబుల్ ఒకడేనా లేదా కానిస్టేబుల్ వెనక ఇతర పోలీస్ అధికారులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story