Kalyandurg: మాజీ ఎంపీ రంగయ్య వ్యాఖ్యలకు టీడీపీ నేతల స్ట్రాంగ్ కౌంటర్!

Kalyandurg: కళ్యాణదుర్గం ప్రజావేదికపై వైసీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య చేసిన విమర్శలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.

P.Sudhakar, Kalyanadurgam
Published on: 13 Sept 2026 4:41 PM IST
Kalyandurg
X

Kalyandurg: మాజీ ఎంపీ రంగయ్య వ్యాఖ్యలకు టీడీపీ నేతల స్ట్రాంగ్ కౌంటర్!

కళ్యాణదుర్గం: వైసీపీ మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య నిన్న చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సూచనతో కళ్యాణదుర్గంలోని ప్రజావేదికలో టీడీపీ నాయకులు సమావేశం నిర్వహించి రంగయ్య వ్యాఖ్యలపై స్పందించారు. సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకుడు మోరేపల్లి చౌలం మల్లికార్జున,రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ నీలస్వామి,మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ గోళ్ల లక్ష్మీదేవి రమేష్, పార్లమెంట్ కార్యదర్శి షమీర్, పట్టణ కన్వీనర్ మదినేని మురళి, కురుబ సంఘం నాయకుడు దొనస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రజావేదిక ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదని, ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన వేదిక అని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులను కలవడం ప్రజాస్వామ్యంలో సహజమైన విషయమని అన్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సూచన మేరకు ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజావేదికను వినియోగిస్తున్నామని తెలిపారు.

మాజీ గ్రూప్-1 అధికారిగా పనిచేసిన రంగయ్య ప్రజావేదిక ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని టీడీపీ నాయకులు సూచించారు. వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరికాదని, అవాకులు చవాకులు పేలే ముందు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. ఏదో చుట్టాపు చూపుగా వచ్చి మాట్లాడి వెళ్లడం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వేదికను రాజకీయ విమర్శలకు ఉపయోగించడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ పేరుతో టీడీపీకి చెందిన అర్హులైన కుటుంబాలకు పెన్షన్ల విషయంలో అన్యాయం జరిగిందని టీడీపీ నాయకులు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత ఉన్న వైసీపీ కుటుంబాలకు కూడా పెన్షన్లు కొనసాగిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రంగయ్య చేస్తున్న వ్యాఖ్యల వల్ల చివరకు వైసీపీ కార్యకర్తలే నష్టపోయే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ మీటర్ల పేరుతో పేద, మధ్యతరగతి ప్రజలపై అధిక విద్యుత్ బిల్లుల భారం పడిందని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ అంశాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు ఎక్కడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.

అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్నారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సహాయం అందించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజావేదికను రాజకీయ విమర్శలకు వేదికగా కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలని కోరారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని, వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే విమర్శలు చేయాలని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు.

P.Sudhakar, Kalyanadurgam

P.Sudhakar, Kalyanadurgam